![]() |
![]() |
byసూర్య | Tue, Nov 21, 2023, 12:46 PM
నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మండలంలోని వెలిమినేడు, రామన్న పేట మండలంలోని కొమ్మయి గూడెం గ్రామాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు 100 మంది మంగళవారం నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కారు గుర్తుకు ఓటు వేసి తనను అధిక మెజార్టీతో గెలిపించాలన్నారు.