byసూర్య | Tue, Nov 21, 2023, 12:14 PM
తెలంగాణ ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. నువ్వే నేనంటూ రెండు పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. ఎల్బీ నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి కాలనీలో బీఆర్ఎస్కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, ఎల్బీనగర్లో బీఆర్ఎస్ జెండాను ఎగురవేయడం ఖాయమన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం నాగోలు డివిజన్ పరిధిలోని సాయినగర్ గుడిసెల్లో స్థానిక నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మళ్లీ ఓటు వేసి తనను శాసనసభకు పంపాలని విజ్ఞప్తి చేశారు.