byసూర్య | Tue, Nov 21, 2023, 11:30 AM
సీఎం కేసీఆర్ జనరంజక పాలన చూసి అభివృద్ధికి ఆకర్షితులై బీఆర్ఎస్ లోకి వలసలు కొనసాగుతున్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. సోమవారం కొండపాక మండలంలోని ఖమ్మంపల్లి గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానిక ఎంపీటీసీ యాదగిరి, నాయకులు మంద శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ని విడి బీఆర్ఎస్ పార్టీలో చేరారు.