![]() |
![]() |
byసూర్య | Tue, Nov 21, 2023, 10:46 AM
ఈ నెల 23న నారాయణఖేడ్ పట్టణంలోని కింగ్స్ ప్యాలెస్ ఫంక్షన్ హాలులో తాలూక స్థాయి ముదిరాజ్ బంధువుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు సంఘం బాద్యులు వెంకట్రాములు, మూఢ రామకృష్ణ, గంగారాంలు తెలిపారు. మంగళవారం వారు ఒక ప్రకటనలో పేర్కొంటూ. 23న నిర్వహించే ఆత్మీయ సమ్మేళనానికి ఎమ్ ఎల్ సి బండ్ల ప్రకాష్, ముదిరాజుల ముద్దుబిడ్డ, మాజీ ఎమ్ ఎల్ సి కాసాని జ్ఞానేశ్వర్ రానున్నారు అన్నారు. ఉదయం 11గంటలకు జరిగే కార్యక్రమానికి తాలూకా పరిధిలోని ముదిరాజులు అందరూ హాజరు కావాలాన్నారు.