![]() |
![]() |
byసూర్య | Tue, Nov 21, 2023, 08:52 AM
కాంగ్రెస్ మేనిఫెస్టోలో కార్మికుల సంక్షేమానికి పెద్ద పీట వేసిందని, దానిని ఐఎన్టీయుసీ పక్షాన స్వాగతిస్తున్నామని ఐఎన్టీయుసీ నగర అధ్యక్ష, కార్యదర్శులు నరాల నరేష్, సిహెచ్ విప్లవ కుమార్ తెలిపారు. ఖమ్మం సంజీవరెడ్డి భవన్ లో జరిగిన సమావేశంలో మాట్లాడారు. గత 10ఏళ్లు పాలించిన ప్రభుత్వం కార్మికుల సంక్షేమాన్ని విస్మరించిందని, మళ్ళీ అధికారంలోకి వస్తే కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తాం అనడం హస్యస్పదమని అన్నారు.