byసూర్య | Tue, Nov 21, 2023, 08:51 AM
పువ్వాడ అజయ్ కుమార్ కి రాష్ట్ర మాల మహానాడు, మాల సంఘాల జేఏసీ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర అధికార ప్రతినిధి మూడుసు జాకబ్ ప్రతాప్, దళిత నేత లింగాల రవికుమార్ ఆధ్వర్యంలో తెలంగాణ మాల మహానాడు, రాష్ట్ర మాల సంఘాల జేఏసీ చైర్మన్ చెరుకు రామచందర్, రాష్ట్ర, జిల్లా నేతలు సోమవారం ఖమ్మంలో పువ్వాడను మర్యాదపూర్వకంగా కలిసి మద్దతు ప్రకటించారు. బీఆర్ఎస్ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని మాలలకు విజ్ఞప్తి చేశారు.