![]() |
![]() |
byసూర్య | Mon, Nov 20, 2023, 11:45 PM
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూకుడు పెంచింది. రెండ్రోజుల క్రితం ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయగా.. తాజాగా హామీలను జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. దాంతో పాటు నియోజవర్గాల్లో అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. పోలింగ్కు మరో 10 రోజులు మాత్రమే ఉండటంతో ఆ పార్టీ అగ్రనేతలు రాష్ట్రానికి క్యూ కడుతున్నారు. రెండ్రోజుల క్రితం తెలంగాణలో పర్యటించిన ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు మరోసారి రాష్ట్రానికి వచ్చారు. ఇవాళ జనగామ, కోరుట్లలో జరగనున్న సకల జనుల విజయ సంకల్ప సభలో ఆయన పాల్గొని ప్రజలనుద్దేశించి మాట్లాడారు.