ఎన్నికల వేళ సరికొత్త దోపిడీ,,,రాష్ట్రంలో ఫేక్ పోలీసులు, ఎన్నికల అధికారులు

byసూర్య | Mon, Nov 20, 2023, 11:52 PM

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి తారాస్థాయికి చేరుకుంది. అభ్యర్థులు ప్రలోభాలపర్వానికి తెరతీస్తున్నారు. నోట్ల కట్టలను నియోజవర్గాలకు తరలిస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చి నాటి నుంచి పోలీసులు, ఎన్నికల అధికారులు ఎక్కడిక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి అక్రమంగా తరలిస్తున్న డబ్బును, మద్యాన్ని సీజ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు రూ. 600 కోట్లకు పైగా నగదు పట్టుబడినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. రెండ్రోజుల క్రితం హైదరాబాద్ అప్పా జంక్షన్‌లో కార్లలో తరలిస్తున్న రూ. 6.5 కోట్లను పోలీసులు సీజ్ చేశారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఓ కీలక నేత డబ్బుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు.


ఇక ఇదే అదనుగా కొందరు కేటుగాళ్లు కొత్తరకం దోపిడీకి తెరలేపారు. సామాన్యులను, వ్యాపారులను టార్గెట్ చేసి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. ఈసీ, పోలీసుల పేరుతో స్థానిక రౌడీ షీటర్లు, వివిధ పార్టీల గల్లీ లీడర్లు డబ్బులు గుంజుతున్నారు. హోల్‌‌‌‌సేల్‌‌‌‌ మార్కెట్లు, హవాలా వ్యాపారులను టార్గెట్‌‌‌‌ చేసి అందినకాడికి దోచుకుంటున్నారు. హైదరాబాద్‌లోని బేగంబజార్‌‌‌‌‌‌‌‌, సికింద్రాబాద్‌‌‌‌ మోండా మార్కెట్‌‌‌‌ సహా గోల్డ్‌‌‌‌ బిజినెస్‌‌‌‌ జరిగే పాన్ మార్కెట్ వ్యాపారులను లక్ష్యంగా చేసుకొని వసూళ్లకు పాల్పడుతున్నారు.


ఈ మార్కెట్లలో ప్రతిరోజూ కోట్ల బిజినెస్ జరగుతుంది. జీఎస్టీ, ఇతర ట్యాక్స్‌లను తప్పిచుకునేందుకు బ్లాక్ దందా చేస్తుంటారు. ఇక్కడ డిజిటల్, ఆన్లైన్ పేమెంట్స్‌‌‌‌ కాకుండా డబ్బులు మాత్రమే తీసుకుంటారు. దీంతో ప్రతి వ్యాపారి వద్ద నోట్ల కట్టలు భారీగా ఉంటాయి. ఈ డబ్బును వారు బ్యాంకుల్లో డిపాజిట్ చేయకుండా దాచుకుంటారు. మరికొందరు హవాలా రూపంలో తరలిస్తారు. దీంతో కొందరు ఫేక్ పోలీసులు, ఎన్నికల అధికారులు వీరిని టార్గెట్ చేస్తున్నారు.


వ్యాపారాలు ముగించుకొని ఇళ్లకు వెళ్లే క్రమంలో ఈ గ్యాంగ్‌లు వారిని అడ్డుకుంటున్నారు. ఒక్కో గ్రూపులో నలుగురైదుగురు ఫేక్ అధికారులు ఉండి వ్యాపారులను అడ్డుకుంటున్నారు. తాము మఫ్టీలో ఉన్న పోలీసులమని చెప్పి వారి వద్ద ఉన్న డబ్బులను స్వాధీనం చేసుకుంటున్నారు. డబ్బులకు లెక్కలు చూపించాలని చెప్పి దర్జగా దోపిడీ చేస్తున్నారు. ఇలా ఈ మధ్య కాలంలో చాలా మంది వ్యాపారుల వద్ద నగదును దోచుకెళ్లారు. కొన్ని ప్రాంతాల్లో సామాన్యుల వద్ద కూడా వీరు డబ్బులను లాక్కుంటున్నారు. ఇది పెళ్లిళ్ల సీజన్ కావటంతో పెళ్లి ఖర్చులకు తీసుకెళ్తున్న డబ్బును దోచుకుంటున్నారు. ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని.. ఎదైనా తేడా వస్తే 100కు కాల్ చేయాలని పోలీసులు చెబుతున్నారు.


Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM