byసూర్య | Mon, Nov 20, 2023, 03:33 PM
మల్కాజిగిరి డివిజన్ ఓల్డ్ నేరేడ్మెట్ లో మేడబోయిన ప్రసాద్ యాదవ్ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం బిఆర్ఎస్ పార్టీ వీడి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు చేతుల మీదుగా ముంత పవన్ యాదవ్ తో పాటు సుమారు 100 మంది కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జి ఎన్ వి. సతిష్ కుమార్, పంజా శ్రీనివాస్ యాదవ్, బీ బ్లాక్ అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్, బీకే శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.