![]() |
![]() |
byసూర్య | Mon, Nov 20, 2023, 02:46 PM
వాట్సప్ వార్ లో ముగ్గురికి కత్తిపోట్లు దిగాయి. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలోని గాంధారి మండలం గాండివేట్ గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు ప్రకారం గ్రామ కాంగ్రెస్ వాట్సప్ గ్రూపులో బిఆర్ఎస్ కార్యకర్తలు ఉండడంతో గ్రూప్ అడ్మిన్ బిందాస్ వారిని తొలగించారు. దీంతో జరిగిన గొడవలో ఒకరిపై ఒకరు కత్తులతో దాడి చేసుకున్నారు. కాంగ్రెస్ కు చెందిన బిందాస్, బిఆర్ కు చెందిన హైమద్, జావిద్ గాయపడ్డారు.