![]() |
![]() |
byసూర్య | Mon, Nov 20, 2023, 02:43 PM
బిజెపి పార్టీతోనే అభివృద్ధి సాధ్యం అవుతుందని కామారెడ్డి బిజెపి అభ్యర్థి వెంకటరమణారెడ్డి అన్నారు. ఆదివారం భిక్నూర్ మండలంలోని భాగిర్తిపల్లి, ఇస్సన్నపల్లి, కంచర్ల, మల్లుపల్లి గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు గ్రామస్తులు మంగళ హారతులతో స్వాగతం పలికారు. అనంతరం మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోడీ అన్ని వర్గాల సంక్షేమానికి ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారని గుర్తు చేశారు.