byసూర్య | Tue, Sep 26, 2023, 11:06 AM
గడిచిన పదేళ్లలో వైద్యారోగ్యశాఖలో ఊహించలేని మార్పులు వచ్చాయని హెల్త్ మినిస్టర్ హరీష్రావు పేర్కొన్నారు. సోమవారం ఆయన రవీంద్ర భారతి వేదికగా పదేళ్ల ప్రగతి నివేదికను విడుదల చేశారు. అనంతరం కొత్తగా ఉద్యోగాలు పొందిన 310 మంది ఫార్మసిస్టులకు పోస్టింగ్ ఆర్డర్స్ అందజేశారు. మంత్రి హరీష్రావు మాట్లాడుతూ.. కొత్తగా డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిధిలో 105, టీవీవీపీ పరిధిలోని 135, డీఎంఈ 70 పోస్టులకు ఎంపికైన స్టాఫ్కు శుభాకాంక్షలు తెలిపారు.