byసూర్య | Tue, Sep 26, 2023, 11:14 AM
సింగరేణి యూనియన్ ఎన్నికలను అక్టోబరులోగా నిర్వహించాలని సంస్థ యాజమాన్యాన్ని హైకోర్టు ఆదేశించింది. ఎన్నికలను వాయిదా వేయాలన్న సింగరేణి సంస్థ అభ్యర్థనను తిరస్కరించింది. సింగరేణి ఎన్నికలకు మే 22న కేంద్ర కార్మిక సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే, అసెంబ్లీ ఎన్నికలు, వరుస పండగలు ఉన్న నేపథ్యంలో ఎన్నికలను వాయిదా వేయాలని సింగరేణి యాజమాన్యం కోరింది. విచారణ చేపట్టిన కోర్టు అక్టోబరులోగా పూర్తి చేయాలని ఆదేశించింది.