byసూర్య | Tue, Sep 26, 2023, 11:28 AM
కేంద్రం త్వరలోనే డీలిమిటేషన్ చేపట్టనుంది. దీనిపై ఇప్పటికే పలుసార్లు చర్చించింది. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ కేంద్రాన్ని హెచ్చరించారు. ఎంపీ సీట్లలో రాష్ట్రాల వారీగా వచ్చే మార్పులను ఓ సంస్థ ఇచ్చిన రిపోర్ట్ను కేటీఆర్ ట్యాగ్ చేస్తూ ఎక్స్ (ట్విట్టర్) లో పోస్ట్ చేశారు. ఆ రిపోర్ట్ ప్రకారం దక్షిణాది రాష్ట్రాలకు ఇప్పుడున్న సీట్ల కంటే 26 తగ్గబోతున్నట్టుగా ఉంది. అదే జరిగితే తీవ్రమైన ప్రజా ఉద్యమం తప్పదంటూ హెచ్చరించారు.