byసూర్య | Tue, Sep 26, 2023, 11:37 AM
2023 ఏడాదికి గాను జనగామ జిల్లా పెంబర్తి, సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ను ఉత్తమ పర్యాటక గ్రామాలుగా కేంద్ర పర్యాటక శాఖ ఎంపిక చేసింది. సెప్టెంబర్ 27న అంతర్జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో అవార్డులను ప్రదానం చేయనున్నారు. కాకతీయుల కాలం నుంచి పెంబర్తి గ్రామం హస్తకళలకు ప్రసిద్ధి. అందమైన ప్రకృతి సోయగాలు కలిగిన చంద్లాపూర్ గ్రామం అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా విరాజిల్లుతోంది.