byసూర్య | Sun, Sep 24, 2023, 11:21 AM
శనివారం ఉదయం పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సిబ్బంది తార్నాక ఎక్స్ రోడ్ లోని ఫ్లైఓవర్ కింద గుర్తు తెలియని వ్యక్తి (45)స్పృహ తప్పి పడివుండటం చూసి 108 అంబులెన్సు కాల్ చేయగా, 108 సిబ్బంది స్థలానికి చేరుకుని పరీక్షించగా అతడు చనిపోయాడని, అతడు అక్కడే బిక్షాటన చేస్తుంటాడని ఓయూ ఎస్సై మల్లేశం తెలిపారు. మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్ తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఓయూ పోలీసులు తెలిపారు.