byసూర్య | Sun, Sep 24, 2023, 10:58 AM
ఏళ్లుగా ప్రభుత్వ స్థలాల్లో నివాసముంటున్న వారికి జీఓ 58 ఒక వరప్రసాదమని జిల్లా కలెక్టర్ వీ. పీ. గౌతమ్ తెలిపారు. ఖమ్మం భక్తరామదాసు కళాక్షేత్రంలో గృహలక్ష్మి మంజూరు ఉత్తర్వులు, జీవో 58 ఇండ్ల పట్టాలు పంపిణీ చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. తరతరాలుగా నివసిస్తున్నా హక్కు లేదని, ఇప్పుడు పట్టా వస్తుండడంతో బ్యాంకు రుణాలు అందుతాయని చెప్పారు. కాగా, ఈ జీఓ అమలులో ఖమ్మం జిల్లా ముందంజలో ఉందన్నారు.