byసూర్య | Sun, Sep 24, 2023, 10:51 AM
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం భూత్పురు మండలం బట్టుపల్లి గ్రామంలో 20 లక్షలతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయితీ భవనంను శనివారం దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేని గ్రామస్థులు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వార్డ్ నెంబర్లు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.