గల్ఫ్ దేశాలకు వెళ్లేవారికి,,,పలు జిల్లాల మీదుగా ఎయిర్‌పోర్టుకు బస్సు

byసూర్య | Sat, Sep 23, 2023, 07:06 PM

జిల్లాల నుంచి గల్ఫ్ దేశాలకు రాకపోకలు సాగించే వారి టీఎస్‌ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలకు వెళ్లేవారి కోసం ప్రత్యేక బస్సు సర్వీసును ఏర్పాటు చేసింది. ఈ ప్రత్యేక బస్సు సర్వీసును వేములవాడ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి నడపనున్నారు. ఈ డీలక్స్ బస్సు ప్రతి రోజు సాయంత్రం 4:30 గంటలకు వేములవాడ నుంచి బయలుదేరుతుంది. సిరిసిల్ల, సిద్దిపేట, జేబీఎస్ మీదుగా శంషాబాద్ విమానశ్రయానికి రాత్రి 9 గంటలకు చేరుకుంటుంది. ఎయిర్ పోర్ట్ నుంచి ఉదయం 6 గంటలకు బయలుదేరి ఉదయం 10 గంటలకు వేములవాడకు వస్తుంది. ఆయా ప్రాంతాల నుంచి దుబాయ్, మస్కట్, తదితర ఇతర దేశాలకు వెళ్లే ప్రయాణికులు ఈ సదుపాయాన్ని వినియోగించుకొని.. ఈ కొత్త సర్వీసును ఆదరించాలని టీఎస్ ఆర్టీసీ విజ్ఞప్తి చేసింది.


ఇక ఈ సారి దసరాకు ఆర్టీసీ బస్సుల్లో సొంతూళ్లకు వెళ్లే వారికి టీఎస్‌ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. ముందస్తు టికెట్ బుకింగ్ చేసుకునే వారికి 10 శాతం రాయతీ ఇవ్వాలని టీఎస్‌ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. అక్టోబర్ 15 నుంచి 29 తేదీల మధ్యలో ప్రయాణానికి రానుపోనూ ఒకేసారి బస్ టికెట్లు బుకింగ్ చేసుకుంటే.. తిరుగు ప్రయాణంపై 10 శాతం డిస్కౌంట్ కల్పిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. ఆయా తేదీల్లో ప్రయాణానికి ఈ నెల 30వ తేది వరకు ముందస్తు రిజర్వేషన్ చేసుకునే ప్రయాణికులకు మాత్రమే ఈ రాయితీ ఆఫర్ వర్తిస్తుందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. రిజర్వేషన్ సదుపాయమున్న అన్నీ సర్వీసుల్లో రాయితీ అమల్లో ఉంటుందని అన్నారు. టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ కొరకు సంస్థ అధికారిక వెబ్ సైట్ http://tsrtconline.in ని సంప్రదించాలని సూచించారు.


Latest News
 

సూర్యలంక పర్యాటక కేంద్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే వేగేశన Wed, Oct 23, 2024, 11:51 AM
హైదరాబాద్‌లో కుంగిపోయిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ రోడ్ Wed, Oct 23, 2024, 11:50 AM
ఈనెల 24న ఆదిలాబాద్ కు కేటీఆర్. Wed, Oct 23, 2024, 11:34 AM
అయ్యప్ప భక్తులకు గుడ్‌ న్యూస్‌. Wed, Oct 23, 2024, 11:01 AM
కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ నాయకులు Wed, Oct 23, 2024, 10:38 AM