byసూర్య | Sat, Sep 23, 2023, 03:49 PM
ఈనెల 27న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్దిదారుల ఎంపిక చేపడతామని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. ఈ అంశంపై GHMC కమిషనర్ రోనాల్డ్రోస్, జిల్లా కలెక్టర్ అనుదీప్తో సమీక్ష నిర్వహించారు. ఈనెల 27న ర్యాండోమైజేషన్ పద్దతిలో ఆన్లైన్ డ్రా ద్వారా 21 వేలమంది లబ్దిదారులను ఎంపిక చేస్తామన్నారు. అక్టోబర్ 2న 10,500, 5న మరో 10,500 ఇళ్లు పంపిణీ చేస్తామని తెలిపారు.