byసూర్య | Sat, Sep 23, 2023, 03:47 PM
నసురుల్లాబాద్ మండల కేంద్రంలో తహాసిల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడి ఉద్యోగులు చేస్తున్న నిరవధిక సమ్మె శనివారం 13 రోజుకు చేరింది. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ తమ డిమాండ్లను నెరవేర్చాలని మోకాళ్ళపై కూర్చొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం గౌరవ వేతనం కాకుండా సుప్రీంకోర్ట్ ఆదేశాల ప్రకారం కనీస వేతనం 26, 000 చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడిలు తదితరులు పాల్గొన్నారు.