byసూర్య | Sat, Sep 23, 2023, 12:41 PM
జోగులాంబ గద్వాల జిల్లాలో 'స్వచ్ఛతా హీ సేవ పక్షోత్సవాల్లో భాగంగా అలంపూర్ మండలంలోని ఊట్కూరు గ్రామంలో శుక్రవారం పారిశుధ్య కార్మికులతో చెత్త చెదారాలను తొలగించినట్లు గ్రామ సర్పంచ్ అయ్యప్పస్వామి తెలిపారు. వర్షాకాల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పరిసరాలను శుభ్రపరుస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇంటి చుట్టు పక్కల నీటి నిల్వ లేకుండా చూసుకోవాలని గ్రామస్థులను సర్పంచ్ కోరారు.