byసూర్య | Sat, Sep 23, 2023, 12:37 PM
వనపర్తి జిల్లాలో రూ. 10 కోట్లతో ఐటీ టవర్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. ఐటీ టవర్ ఏర్పాటుకు సంబంధించిన జీవో త్వరలో రానుందని తెలిపారు. ఐటీ టవర్ ఏర్పాటు అయితే ఈ ప్రాంతంలో అనేక మందికి ఉద్యోగాలు లభిస్తాయని అన్నారు. వనపర్తిని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.