byసూర్య | Sat, Sep 23, 2023, 11:53 AM
వికారాబాద్ జిల్లా సూల్తాన్పూర్లో ఓ ప్రైవేటు స్కూల్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. ప్రమాదవశాత్తు బస్సు నీటి కుంటలోకి దూసుకెళ్లింది. ఈ సంఘటనను గమనించిన స్థానికులు హుటాహుటిన బస్సులోని 40 మంది విద్యార్థులను కాపాడారు. స్టీరింగ్ పనిచేయకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని బస్సు డ్రైవర్ తెలిపారు.