byసూర్య | Sat, Sep 23, 2023, 11:16 AM
తెలంగాణలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష మరోసారి రద్దైంది. జూన్ 11న జరిగిన ఈ పరీక్షను హైకోర్టు రద్దు చేసింది. పరీక్షలో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయలేదని, హాల్ టికెట్ నంబర్ లేకుండా ఓఎంఆర్ షీట్లు ఇచ్చారంటూ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. పరీక్షను రద్దు చేస్తూ మళ్లీ నిర్వహించాలంటూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది.