ఎన్ని ప్రచారాలు చేసినా,,, ఓటర్ రిజిస్టర్‌కు ముఖం చాటేస్తున్న తెలంగాణ అమ్మాయిలు

byసూర్య | Fri, Sep 22, 2023, 07:30 PM

చాలా ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ల బిల్లును లోక్‌సభ ఆమోదించింది. ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో నారీ శక్తి వందన్‌ అధినియమ్‌ అనే పేరుతో కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ మహిళా రిజర్వేషన్ల బిల్లును ప్రవేశపెట్టారు. బుధవారం జరిగిన ఓటింగ్‌లో మొత్తం 456 మంది సభ్యులకు గాను 454 మంది ఎంపీలు బిల్లుకు మద్దతుగా ఓటు వేశారు. దీంతో దీంతో ఈ మహిళా రిజర్వేషన్ల బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందినట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు.


ఓ వైపు చట్టసభల్లో మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలని రిజర్వేషన్ కల్పిస్తుంటే.. తెలంగాణలో యువత మాత్రం ఓటర్లుగా నమోదు చేసుకోవటానికి ముందుకు రావటం లేదు. ముఖ్యంగా అమ్మాయిలు ఓటుహక్కు నమోదుకు వెనకాడుతున్నారు. ఇటీవల తెలంగాణ ఎన్నికల అధికారులు వెల్లడించిన డేటా ప్రకారం.. 18-19 ఏళ్ల యువ ఓటర్లలో అమ్మాయిల లింగ నిష్పత్తి కేవలం 717 మాత్రమే అని చెప్పారు. కొత్త ఓటర్ల నమోదు కోసం చర్యలు తీసుకుంటున్నప్పటికీ 18-19 ఏళ్లలోపు అమ్మాయిలు నమోదు చేసుకోవడానికి ఆసక్తి చూపడం లేదని అన్నారు. అందులోనూ కాలేజీకి వెళ్లే అమ్మాయిలే ఎక్కువగా ఓటు హక్కు నమోదుకు ముందుకు రావటం లేదు. ఓటర్ నమోదుకు స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించి ప్రముఖులచే క్యాంపెయిన్ నిర్వహించినా స్పందన ఉండటం లేదు.


కాలేజీల్లో ఎలక్టోరల్ లిటరసీ క్లబ్ వంటి ఏర్పాటు చేసినా ఫలితం అంతంత మాత్రమే. ఇంజినీరింగ్ కాలేజీల్లో ఓటరు నమోదుకు అబ్బాయిలు ఆసక్తి చూపిస్తున్నా.. అమ్మాయిలు మాత్రం వెనుకంజ వేస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో.. ముఖ్యంగా జీహెచ్‌ఎంసీలో యువ ఓటర్ల ఉదాసీనంగా ఉన్నారని తేలింది. హైదరాబాద్‌లో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 48.89 పోలింగ్ శాతం మాత్రమే నమోదైందని అధికారులు చెప్పారు. కొత్త ఓటర్ల రిజిస్ట్రేషన్, పోలింగ్ శాతాన్ని ప్రయత్నాలు చేస్తున్నామని అధికారులు తెలిపారు. యువ ఓటర్లను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నామని.. ఓటు అవగాహన కోసం మాలావత్ పూర్ణ వంటి వారితో క్యాంపెయిన్ నిర్వహిస్తున్నామని చెప్పారు. సినీ ప్రముఖులతోనూ ఓటు హక్కు ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తున్నట్లు అధికారులు చెప్పారు.


తెలంగాణలో అసెంబ్లీ సాధారణ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. అధికారులు పోలింగ్‌ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. కీలకమైన ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఓటు నమోదు తొలగింపు, సవరణలకు ప్రత్యేకంగా శిబిరాలు ముగిసినప్పటికీ ఈ నెల 19 వరకు స్వీకరించేందుకు ఎన్నికల సంఘం అవకాశమిచ్చింది. ఆగస్టు 21న విడుదలైన ముసాయిదా జాబితాపై అభ్యంతరాలను సెప్టెంబరు 19 వరకు స్వీకరించారు. అభ్యంతరాలతో పాటు ఓటు నమోదు, తొలగింపు, సవరణలకు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో వచ్చిన వాటిని బీఎల్‌వోలు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి ఈ నెల 28 వరకు పరిష్కరించనున్నారు. అక్టోబరు 4న ఓటరు తుది జాబితా విడుదల కానుంది.


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM