byసూర్య | Fri, Sep 22, 2023, 12:05 PM
షాద్నగర్ ఫరూఖ్ నగర్ మండలం కొంగ గూడ తండా గిరిజన వాసి వంకడవత్ రవి(35) అనుమానస్పద రీతిలో కిషన్ రావు మామిడి తోటలో మృతి చెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. గత మూడు సంవత్సరాల నుండి కిషన్ రావు మామిడి తోటలో దంపతులిద్దరూ పనులు కొనసాగిస్తున్నారు. గతంలో ఈ తోటలో పనిచేస్తున్న ఇతర రాష్ట్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులతో ఘర్షణ పడినట్టు చెబుతున్నారు.