byసూర్య | Fri, Sep 22, 2023, 12:24 PM
తెలంగాణలోని పేద ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అర్హులైన పేదలు సొంతిల్లు నిర్మించుకునేందుకు 75 గజాల చొప్పున ప్రభుత్వం ఇంటిస్థలం మంజూరు చేస్తోంది. ఇప్పటివరకు 30వేల మందికి పట్టాలు పంపిణీ చేసింది. మరో 20వేల మందికి వారం, పది రోజుల్లో అందజేయాలని భావిస్తోంది. ఇందుకోసం తహసీల్దార్లు అర్హుల జాబితా సిద్ధం చేస్తున్నారు. కాగా, గతంలోనే భూములను సిద్ధం చేయగా మధ్యలో లబ్ధిదారుల ఎంపిక నిలిచిపోవడంతో ఈ ప్రక్రియ వేగవంతం చేస్తోంది.