byసూర్య | Fri, Sep 22, 2023, 11:57 AM
దమ్మపేట మండలంలోని గండుగుపల్లి గ్రామానికి చెందిన నాగమణికి పెళ్లి సమయంలో తల్లిదండ్రులు రూ. 15 లక్షలు కట్నంగా ఇచ్చారు. కొద్దికాలంగా మరో రూ. 5 లక్షలు అదనపు కట్నం తేవాలని భర్త శ్రీహర్ష, అత్త సుందర రాజమణి, బావ వెంకట్రామ్ లు నాగమణిని వేధిస్తున్నారు. వీరి వేధింపులు తాళలేని నాగమణి గురువారం దమ్మపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్సై రవికుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.