byసూర్య | Thu, Sep 21, 2023, 02:22 PM
గణేష్ ఉత్సవాల్లో భాగంగా జిల్లా కలెక్టరేట్ లోని కార్యాలయ ఆవరణలో ప్రతిష్ఠించిన విఘ్నేశ్వరుడికి గురువారం జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి, అదనపు కలెక్టర్లు రాహుల్ శర్మ, లింగ్యా నాయక్, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ అమిత్ నారాయణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాలుగు రోజులుగా వివిధ శాఖల అధికారులు సిబ్బంది పూజలు నిర్వహించడంతో పాటు కలెక్టరేట్ ఆవరణలో అన్నదాన కార్యక్రమాలు చేపడుతున్నారు.