byసూర్య | Thu, Sep 21, 2023, 02:05 PM
దసరాకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఎవరైతే ముందుగా టికెట్ బుక్ చేసుకుంటారో.. వారికి 10% రాయితీ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ఎండీ సజ్జనార్ స్పందిస్తూ.. అక్టోబర్ 15- 29 తేదీల మధ్య ఒకేసారి రానుపోనూ టికెట్స్ బుక్ చేసుకుంటే తిరుగు ప్రయాణంపై 10% డిస్కౌంట్ కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 30వ తేదీ వరకు ముందస్తు రిజర్వేషన్ చేసుకునే వారికి మాత్రమే రాయితీ వర్తిస్తుందని తెలిపారు.