byసూర్య | Thu, Sep 21, 2023, 02:03 PM
గురువారం నాగర్ కర్నూల్ జిల్లా ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిపై 2018 ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారని ఆరోపిస్తూ కాంగ్రెస్ నేత, మాజీమంత్రి నాగం జనార్దన్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇటీవల సరైన ఆధారాలు లేవంటూ హైకోర్టు ఈ కేసును కొట్టివేసింది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి నాగం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఎమ్మెల్యేకి నోటీసులు జారీ చేసింది.