byసూర్య | Thu, Sep 21, 2023, 01:53 PM
దేశంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనని మంత్రి కేటీఆర్ అన్నారు. దుండిగల్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను గురువారం కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇచ్చే బాధ్యత తమదని చెప్పారు. కొన్ని పార్టీలు ఇష్టమొచ్చిన్నట్లు హామీలు ఇస్తున్నాయని తెలిపారు. పనిచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని పేర్కొన్నారు.