byసూర్య | Thu, Sep 21, 2023, 12:33 PM
సికింద్రాబాద్ నుంచి ఖమ్మం మీదుగా విశాఖపట్టణం వెళ్లే వందేభారత్ రైలును దక్షిణ మధ్య రైల్వే మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దింది. సీట్ల వాలు కోణం 17. 31 నుంచి 19. 37 డిగ్రీలకు పెంచింది. ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ రంగును ఎరుపు నుంచి నీలం రంగులోకి మార్చడంతోపాటు సీట్ల కిందిభాగంలో మొబైల్ చార్జింగ్ పాయింట్ ఏర్పాటు చేశారు. మరుగుదొడ్లలో వాష్ బేసిన్ నీరు బయటకు చిమ్మకుండా లోతు పెంచారు.