byసూర్య | Thu, Sep 21, 2023, 12:34 PM
నేలకొండపల్లి మండలంలోని చెన్నారం గ్రామానికి చెందిన మాధవరావు, వజ్జా రాధా కృష్ణమూర్తికి పాలేరు పాత కాలువ 25వ తూము వద్ద విద్యుత్ ఆధారంగా పంటలు సాగు చేస్తున్నారు. కాగా, మాధవరావుకు చెందిన రెండు మోటార్లు, రాధాకృష్ణమూర్తికి చెందిన ఒక మోటార్ను గుర్తు తెలియని దుండగులు చోరీ చేశారు. వారం రోజుల కిందట ఇదే కాలువపై వజ్జా మూర్తి, వజ్జా శ్రీను, వి. నాగేశ్వరరావుకు చెందిన మోటార్లు ఒకే రోజు చోరీకి గురైన విషయం విదితమే.