byసూర్య | Thu, Sep 21, 2023, 12:34 PM
తుంగతుర్తి పరిధిలోని బొడ్డుగూడం గ్రామ శివారులో బుధవారం ఆర్టిసి బస్సు బోల్తా ఘటనలో ఇద్దరు మృతి చెందిన విషయం విధితమే.. ఒకరు బిబి గూడెం మండలానికి చెందిన కొండ రాములు కోటమర్తిలో సెక్రటరీగా పని చేస్తున్నారు. బంధువు అంత్యక్రియలకి వెళ్తున్న క్రమంలో ప్రమాదంలో మృతిచెందాడు. మరొకరు చిన్నపడిశాల గ్రామానికి చెందిన యకమ్మ బంధువులను కలవడానికి హైదరాబాద్ వెళుతున్న క్రమంలో బస్సు ఎక్కిన పది నిమిషాలకే ప్రమాదానికి గురై ప్రాణాలొదిలింది.