byసూర్య | Thu, Sep 21, 2023, 12:32 PM
వైరా నియోజకవర్గ పరిధిలో ప్రస్తుతం ఉన్న మబ్బు వాతావరణ పరిస్థితుల్లో కంది పంటలో ఆకు గూడు పురుగు ఆశించినట్లు వ్యవసాయ శాఖ అధికారులు గురువారం తెలిపారు. ఈ ఆకు గూడు పురుగు లార్వాలు ఆకులను, లేత చిగురాకులను గూడుగా చేసి లోపల ఉండి ఆకులను తింటాయి. నివారణకు లీటర్ నీటికి 1. 6ఎంఎల్ మోనోక్రోటోఫాస్ లేదా 2. 0ఎంఎల్ ప్రొఫెనోఫాస్ లేదా 2. 0 ఎంఎల్ క్వినాల్ పాస్ మందును కలిపి పిచికారి చేయాలని కృషి విజ్ఞాన కేంద్రం వారు తెలిపారు.