byసూర్య | Thu, Sep 21, 2023, 12:31 PM
కారేపల్లి మండల పరిధిలోని భజ్యాతండా గ్రామ పంచాయితీ కార్యాలయ నిర్మాణ పనులు ప్రారంభమైయ్యాయి. నిర్మాణ పనులను గురువారం గ్రామ సర్పంచ్ బానోత్ సంధ్య ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. గతంలో ఉమ్మడి విశ్వనాథపల్లి గ్రామ పంచాయితీలో ఉన్న భజ్యాతండాను కొత్త గ్రామ పంచాయితీగా ఏర్పాటు చేశారు. కార్యాలయ నిర్మాణం కోసం ఐటీడీఏ నిధుల నుండి రూ. 20లక్షలు మంజూరు అయ్యాయి.