byసూర్య | Thu, Sep 21, 2023, 12:13 PM
అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని అత్తిగూడ, తట్టిఅన్నారం, తిమ్మాయి గూడ గ్రామాల పరిధిలో జీహెచ్ఎంసీ నిర్మించిన డబుల్ బెడ్ ఇండ్లను గురువారం ప్రారంభినున్నట్లు అధికారులు తెలిపారు. అత్తిగూడలోని 432 ఇళ్లను మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, తట్టినారంలోని 1,268 గృహాలను హోంమంత్రి మహమూద్ అలీ, తిమ్మాయిగూడలోని 600 ఇళ్లను మేయర్ గద్వాల విజయ లక్ష్మి లబ్ధిదారులకు అందివ్వనున్నారు. ఈ మేరకు గ్రేటర్ అధికారులు ఏర్పాట్లను పరిశీలించారు.