byసూర్య | Thu, Sep 21, 2023, 12:02 PM
నేలకొండపల్లి మండలంలోని జాతీయ రహదారి పనులకు వినియోగిస్తున్న ఇతర రాష్ట్రాల వాహనాలను పన్నులు చెల్లించకపోవటంతో అధికారులు సీజ్ చేశారు. కోదాడ -కురవి జాతీయ రహదారి నిర్మాణ పనులకు వినియోగిస్తున్న క్రేన్, రెండు టిప్పర్లను మోటార్ వాహన అధికారి ఎ. వరప్రసాద్ సీజ్ చేశారు. మూడు వాహనాలకు తెలంగాణ ప్రభుత్వం పన్నులు చెల్లించకుండా రవాణా చేస్తుండటంతో సీజ్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పగించారు.