byసూర్య | Thu, Sep 21, 2023, 12:01 PM
జిల్లాలోని పలు ప్రాంతాల్లో బుధవారం రాత్రి వర్షం కురవడంతో రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా నాలుగు రోజుల పాటు జిల్లాలో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ముందుగానే ప్రకటించింది. కొద్దిరోజులుగా అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న ప్రజలు సైతం వర్షం కోసం ఎదురుచూశారు. ఎట్టకేలకు బుధవారం రాత్రి ఉరుములతో కూడిన వర్షం కురవడంతో వాతావరణం చల్లబడింది.