byసూర్య | Thu, Sep 21, 2023, 11:56 AM
తిమ్మాపూర్ జాతీయ రహదారి స్టేజి వద్ద గురువారం యూటర్న్ తీసుకుంటున్న శ్రీ చైతన్య కాలేజీ బస్సును హైదరాబాద్ వైపు నుండి వస్తున్న డీసీఎం వ్యాన్ ఢీ కొట్టింది. బస్సులో ఉన్న విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. బస్సులో సుమారుగా 40 మంది విద్యార్థులు ఉన్నట్లుగా స్థానికులు తెలిపారు. కాలేజీ బస్సు డ్రైవర్ చూడకుండా యూటర్న్ తీసుకోవడం వల్ల ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు.