కేటీఆర్ ఫ్లేక్సీలు కడుతుండగా విద్యుత్ షాక్

byసూర్య | Wed, Sep 20, 2023, 08:31 PM

తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఈ రోజు రెండో విడత డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీ కోసం హైదరాబాద్‌ లోని కుత్బుల్లాపూర్‌కి వసున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు స్వాగతం పలుకుతూ ఆ ప్రాంతమంతా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే, ఉదయం 5 గంటల సమయంలో స్వాగత ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే క్రమంలో ప్రమాదం చోటు చేసుకుంది. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి చింతల్ బస్టాప్ సమీపంలో కేటీఆర్ ఫ్లెక్సీలు కడుతున్న కొందరికి విద్యుత్ షాక్ తలిగింది. ఈ ఘటనలో విఠల్ (19), దుర్గేష్ (19 ), బాలరాజు (18), నాగనాథ్ (33)కు గాయాలయ్యాయి. తీవ్రగాయాలైన నాగ్ నాథ్ ను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.



Latest News
 

హైదరాబాదీలకు శుభవార్త.. ఇక ఇంటి వద్దకే ఆ సేవలు.. మంత్రి కీలక ప్రకటన Sat, Oct 26, 2024, 11:43 PM
తెలంగాణలో పత్తి రైతులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్యలకు చెక్ Sat, Oct 26, 2024, 10:15 PM
నేష‌న‌ల్ గేమ్స్‌కు తెలంగాణ ఆతిథ్యం.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు Sat, Oct 26, 2024, 10:13 PM
ప్రపంచమంతా హైదరాబాద్‌ వైపు చూసేలా.. నగరం మరో ఐకానిక్ నిర్మాణం: సీఎం రేవంత్ Sat, Oct 26, 2024, 09:28 PM
గ్రీజు వంటి నూనె, కుళ్లిన చికెన్.. హోటల్స్, స్వీట్ షాపుల్లో దారుణాలు Sat, Oct 26, 2024, 09:27 PM