byసూర్య | Sat, Jun 10, 2023, 10:32 AM
పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాలకు ఈ నెల 14వ తేదీ నుంచి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు ఆదిలాబాద్ సంజయ్ గాంధీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ పి. భరద్వాజ ఒక ప్రకటనలో తెలిపారు. స్లాటు బుకింగ్, రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లింపు, సర్టిఫికెట్ల ధ్రువీకరణకు ఈ నెల 14 నుంచి 18 వరకు కౌన్సెలింగ్ ఉంటుందని పేర్కొన్నారు. అభ్యర్థులు వెంట పాలీసెట్ ర్యాంకు కార్డు, హాల్ టికెట్, ఎస్సీసి మెమో, నాలుగో తరగతి నుంచి పదో తరగతి వరకు బోనాఫైడ్, టీసీ, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు తీసుకురావాలని సూచించారు. సర్టిఫికెట్ల ధ్రువీకరణ తర్వాత ఆన్లైన్లో 16 నుంచి 21 వరకు కళాశాలల ఎంపిక, ఈ నెల 25న సీట్ల కేటాయింపు ఉంటుందని వివరించారు. ట్యూషన్ ఫీజు చెల్లింపు అనంతరం ఈ నెల 29లోగా సంబంధిత కళాశాలలో రిపోర్టు చేయాలని తెలిపారు.