14 నుంచి పాలీసెట్ కౌన్సెలింగ్

byసూర్య | Sat, Jun 10, 2023, 10:32 AM

పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాలకు ఈ నెల 14వ తేదీ నుంచి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు ఆదిలాబాద్ సంజయ్ గాంధీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ పి. భరద్వాజ ఒక ప్రకటనలో తెలిపారు. స్లాటు బుకింగ్, రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లింపు, సర్టిఫికెట్ల ధ్రువీకరణకు ఈ నెల 14 నుంచి 18 వరకు కౌన్సెలింగ్ ఉంటుందని పేర్కొన్నారు. అభ్యర్థులు వెంట పాలీసెట్ ర్యాంకు కార్డు, హాల్ టికెట్, ఎస్సీసి మెమో, నాలుగో తరగతి నుంచి పదో తరగతి వరకు బోనాఫైడ్, టీసీ, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు తీసుకురావాలని సూచించారు. సర్టిఫికెట్ల ధ్రువీకరణ తర్వాత ఆన్లైన్లో 16 నుంచి 21 వరకు కళాశాలల ఎంపిక, ఈ నెల 25న సీట్ల కేటాయింపు ఉంటుందని వివరించారు. ట్యూషన్ ఫీజు చెల్లింపు అనంతరం ఈ నెల 29లోగా సంబంధిత కళాశాలలో రిపోర్టు చేయాలని తెలిపారు.


Latest News
 

ఇంకో వారం ఉంది ఆ లెక్క ఎక్కడికెళ్తుందో.. మంత్రి కోమటిరెడ్డి వీడియోతో యాంకర్ శ్యామల సెటైరికల్ ట్వీట్ Mon, May 06, 2024, 08:00 PM
హైదరాబాద్​లో ఈ ఏడు ప్రాంతాల్లో హీట్ ఐలాండ్స్.. అక్కడ మాడు పగిలిపోయే ఎండలు, కారణమిదే Mon, May 06, 2024, 07:55 PM
కొత్త కాపురంలో చిచ్చు పెట్టిన జ్యూస్.. పెళ్లైన నాలుగు రోజులకే భార్యను పుట్టింటికి పంపిన భర్త Mon, May 06, 2024, 07:52 PM
రైతులకు పండగలాంటి వార్త.. వాళ్లందరి అకౌంట్లలోకి డబ్బులు జమ Mon, May 06, 2024, 07:48 PM
ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు బెయిల్ నిరాకరణ... కీలక నిర్ణయం దిశగా అడుగులు Mon, May 06, 2024, 07:45 PM