byసూర్య | Fri, Jun 09, 2023, 09:52 PM
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా పోలీసులకు శుభవార్త అందింది. పోలీసు శాఖలో పదోన్నతులకు పచ్చజెండా ఊపింది. 18 మంది అదనపు ఎస్పీలకు ఎస్పీలుగా పదోన్నతి కల్పించారు. దీంతో పాటు 37 మంది డీఎస్పీలకు అదనపు ఎస్పీలుగా పదోన్నతి కల్పించారు. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆ శాఖలో నూతనోత్తేజం నెలకొంది.