byసూర్య | Thu, Jun 08, 2023, 12:15 PM
కొణిజర్ల మండల పరిధిలోని వైరా మునిసిపాలిటి పరిధి లాలాపురం గ్రామంలోని ఓ చెరువు మట్టిని పొలాల కోసం అనుమతి తీసుకొని రోడ్డు ప్రక్కన నిర్మించిన గోదాముకు తోలుతున్నారని తెలిసింది. చెరువు మట్టిని రైతుల పొలాలకు తప్పా ఇతర కార్యక్రమాలకు ఉపయోగించకూడదు. చెరువులో మట్టిని కూడ నిబందనలు ప్రకారం నిర్దేశిత లోతుతో తవ్వాలి. ఈ విషయం పై ఇరిగేషన్ జేఈ మనోజను వివరణ కోరగా చెరువు మట్టి తోలకం విషయంలో రైతు పొలానికి అనుమతి ఇచ్చామని, గోదాముకు తోలితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వచ్చిన ఆరోపణలపై పరిశీలిస్తామని తెలిపారు. రైతులు చెరువు మట్టిని పొలాలకు మాత్రమే వినియోగించుకోవాలని సూచించారు.