byసూర్య | Thu, Jun 08, 2023, 12:16 PM
రైల్వే మరమ్మతుల వలన గత నెల 26వ తేదీ నుండి జూన్ 7వ తేదీ వరకు తాత్కాలికంగా రద్దు అయిన రైళ్ళను శుక్రవారం నుంచి పునఃప్రారంభిస్తున్నట్లు రైల్వే అధికారులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం (17660) కొత్తగూడెం నుండి సికింద్రాబాద్ వరకు వెళ్లే కాకతీయ ఎక్స్ప్రెస్ ట్రైన్, (17033) కొత్తగూడెం నుండి సిర్పూర్ కాగజ్నగర్ వరకు వెళ్లే ట్రైన్, ప్రతిరోజు సాయంత్రం (07335) బెల్గవి కొత్తగూడెం నుంచి సికింద్రాబాద్ వెళ్లే ట్రైన్ ఈ మూడు రైళ్లు జూన్ 9వ తేదీ నుంచి వయా గాంధీనగర్, కారేపల్లి మీదుగా యథావిధిగా నడుస్తాయని రైల్వే అధికారులు తెలిపారు. మండల, పరిసర ప్రాంత ప్రజలు ఈ మార్గం గుండా ప్రయాణించే ప్రయాణికులు గమనించాలని కోరారు.