byసూర్య | Wed, Jun 07, 2023, 01:18 PM
ములుగు జిల్లాలో రూ.150 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు మంత్రి KTR శంకుస్థాపన చేశారు. డిగ్రీ కళాశాల సమీపంలో ఉన్న సమీకృత కలెక్టరేట్ భవన సముదాయానికి, రూ.38.50 కోట్లతో నిర్మించనున్న జిల్లా పోలీసు కార్యాలయ భవన నిర్మాణాలకు ఆయన శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ కార్యాలయాల పక్కా భవనాలు, మోడల్ బస్టాండ్ సముదాయానికి, సేవాలాల్ భవనానికి సైతం KTR శంకుస్థాపన చేశారు.