byసూర్య | Mon, May 29, 2023, 10:43 AM
పురానాపూల్ డివిజన్ పరిధిలో సోమవారం హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. శంకుస్థాపనాలకు సంబంధించిన ఏర్పాట్లను ఎంఐఎం ఎమ్మెల్సీ మిర్జా రెహ్మాత్ బెగ్, డివిజన్ కార్పొరేటర్ సున్నం రాజమోహన్ తో కలిసి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. శంకుస్థాపన కార్యక్రమంలో చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్ పాల్గొంటారని భద్రత ఏర్పాట్లు చేయాలని పోలీసులకు సూచించారు.