యూట్యూబ్ చానళ్లు పై నటి హేమ పోలీసులకు ఫిర్యాదు

byసూర్య | Tue, Mar 21, 2023, 10:33 PM

ఇటీవల యూట్యూబ్ ఛానల్స్ విపరీతంగా పెరిగిపోవడంతో వివాదాలు కూడా అంతే స్థాయిలో పెరిగిపోతున్నాయి. ఇదిలావుంటే మూడేళ్ల నాటి ఫొటోలతో తప్పుడు థంబ్ నెయిల్స్ పెట్టి తనపై దుష్ప్రచారం చేస్తున్నాయంటూ కొన్ని యూట్యూబ్ చానళ్లు, వెబ్ సైట్లపై టాలీవుడ్ నటి హేమ హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూడేళ్ల కిందట పెళ్లి రోజు వేడుకల సందర్భంగా భర్తతో ఉన్న ఫొటోలను ఇప్పుడు మరోసారి పోస్టు చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని హేమ ఆరోపించారు. దీనిపై తాను న్యాయపోరాటం చేసేందుకు కూడా వెనుకాడడని స్పష్టం చేశారు. 


సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకుని దుష్ప్రచారం చేసే యూట్యూబ్ చానళ్లు, వెబ్ సైట్లపై చర్యలు తీసుకోవాలని ఆమె సైబర్ క్రైమ్ పోలీసులను కోరారు. కొందరు సినీ ప్రముఖులు బతికే ఉన్నప్పటికీ, వారు చనిపోయారంటూ డబ్బుల కోసం అసత్య కథనాలు ప్రచారం చేస్తున్నారని హేమ ఆవేదన వ్యక్తం చేశారు. అందుకు ఉదాహరణగా కోట శ్రీనివాసరావు అంశాన్ని ప్రస్తావించారు. కోట ఇక లేరంటూ తప్పుడు ప్రచారం చేశారని వెల్లడించారు.



Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM