యూట్యూబ్ చానళ్లు పై నటి హేమ పోలీసులకు ఫిర్యాదు

byసూర్య | Tue, Mar 21, 2023, 10:33 PM

ఇటీవల యూట్యూబ్ ఛానల్స్ విపరీతంగా పెరిగిపోవడంతో వివాదాలు కూడా అంతే స్థాయిలో పెరిగిపోతున్నాయి. ఇదిలావుంటే మూడేళ్ల నాటి ఫొటోలతో తప్పుడు థంబ్ నెయిల్స్ పెట్టి తనపై దుష్ప్రచారం చేస్తున్నాయంటూ కొన్ని యూట్యూబ్ చానళ్లు, వెబ్ సైట్లపై టాలీవుడ్ నటి హేమ హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూడేళ్ల కిందట పెళ్లి రోజు వేడుకల సందర్భంగా భర్తతో ఉన్న ఫొటోలను ఇప్పుడు మరోసారి పోస్టు చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని హేమ ఆరోపించారు. దీనిపై తాను న్యాయపోరాటం చేసేందుకు కూడా వెనుకాడడని స్పష్టం చేశారు. 


సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకుని దుష్ప్రచారం చేసే యూట్యూబ్ చానళ్లు, వెబ్ సైట్లపై చర్యలు తీసుకోవాలని ఆమె సైబర్ క్రైమ్ పోలీసులను కోరారు. కొందరు సినీ ప్రముఖులు బతికే ఉన్నప్పటికీ, వారు చనిపోయారంటూ డబ్బుల కోసం అసత్య కథనాలు ప్రచారం చేస్తున్నారని హేమ ఆవేదన వ్యక్తం చేశారు. అందుకు ఉదాహరణగా కోట శ్రీనివాసరావు అంశాన్ని ప్రస్తావించారు. కోట ఇక లేరంటూ తప్పుడు ప్రచారం చేశారని వెల్లడించారు.



Latest News
 

పీఎం కిసాన్ డబ్బులు పడ్డాయని మెస్సేజ్.. ఓపెస్ చేస్తే రూ.2 లక్షలు కట్.. మీరూ ఇలా చేయకండి. Tue, Jan 14, 2025, 09:55 PM
గాలిపటం ఎగరేసేందుకు గుట్టపైకి పిల్లలు.. పొదల మాటున కనిపించిన సీన్ చూసి షాక్ Tue, Jan 14, 2025, 09:03 PM
కల్వకుంట్ల కవిత ఇంట్లో స్పెషల్ సంక్రాంతి.. వెల్లివిరిసిన సంతోషం Tue, Jan 14, 2025, 08:57 PM
చోరీ చేసి పారిపోతూ ఫ్లైఓవర్ నుంచి దూకేశాడు Tue, Jan 14, 2025, 08:50 PM
ఆ మంత్రికి వయసు పెరిగినా చిలిపి చేష్టలు పోలేదు.. బీజేపీ ఎంపీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ Tue, Jan 14, 2025, 08:46 PM